- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోంది. అయితే, సిట్ అధికారి వెంకట్రావు నియామకం సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని, ఆయన దర్యాప్తు కొనసాగించరాదని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 26వ తేదీన జరుగనుంది. హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిస్తుందా లేదా కొట్టివేస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
- Advertisement -