Friday, June 13, 2025
E-PAPER
Homeజాతీయంపీఎంని క‌లవాలంటే..ఆ టెస్ట్‌ పాస్ కావాల్సిందే..!

పీఎంని క‌లవాలంటే..ఆ టెస్ట్‌ పాస్ కావాల్సిందే..!

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో పీఎంవో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.ఇకపై ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంవో సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులకు రాత్రి 7:30 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు సమాచారం.

గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో పాటు ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,121లకు చేరింది.దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. ఈమేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గుజరాత్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -