- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల : గత కొన్ని ఏళ్లుగా గద్వాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు, ప్రజలు రోడ్లను చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు గతుకుల రోడ్లకు అతుకులు వేస్తూ టూత్ పాలిష్ పనులు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు గుంతలుగా మారడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతూ కిందపడి గాయాలు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు, R&B అధికారులు బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చి వేస్తున్నారు.
- Advertisement -