- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నైజీరియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ప్లాటూ రాష్ట్రంలోని కంపాని జూరాక్ ప్రాంతంలో ఓ గనిలో విషవాయవులు వెలువడి.. 37మంది కార్మికులు మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా అస్వస్థతకు గురైయ్యారు. బాధితులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన తరువాత నైజీరియా ప్రభుత్వం సదురు గని ప్రాంతాన్ని మూసివేసింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది.
- Advertisement -



