Saturday, March 21, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య

విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తిరుపతి జిల్లా పుత్తూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్న పద్మ (28).. తన ఇద్దరు పిల్లలు తేజ (6), లాస్య (5) లకు ఉరివేసి, తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ పోషణకు భర్త శివశంకర్‌ సహకరించడం లేదని, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నానని పద్మ రాసిన లేఖలో పేర్కొంది. భర్త ఉద్యోగం వచ్చిందని చెప్పినా, అప్పులు కట్టలేదని తెలియడంతో మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడింది. పోలీసులు శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -