- Advertisement -
– ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి
రాంచీ: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రయివేటు హెలికాప్టర్ కూలిపోయింది గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలీకాప్టర్లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు చనిపోగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -