- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



