- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు మండల స్థాయి శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని ఎంఈఓ రాజా గంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు బోధన పద్ధతులు, ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు విద్యాబోధన శిక్షణ తరగతుల పై అవగాహన కల్పిస్తూ శిక్షణను తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -