నవతెలంగాణ-కన్నాయిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8/2/2026 నుండి రైతులకు కావలసిన యూరియా బస్తాల లను యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు , కొనుగోలు చేయాలని నిర్దేశించడం జరిగింది. అందుకుగాను ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆ యాప్ యాప్ ద్వారా ఏ విధంగా కొనుగోలు చేయాలన్న విషయం పై కన్నాయిగూడెం మండలంలో ఎరువుల షాపు వద్ద ఉన్న రైతులకు మండల వ్యవసాయఅధికారి ముంజ మహేశ్ యాప్ వాడకాన్ని వివరించి, యూరియా బస్తాలను ఇప్పించడం జరిగిందని. అంతేకాకుండా ఈ ఆప్ గురించి ఏమైనా రైతులకు సందేహాలు ఉన్నట్లయితే మండల వ్యవసాయ అధికారి కన్నాయి గూడెం 8977751150, వ్యవసాయ విస్తరణ అధికారి కళ్యాణి 8712499917 సంప్రదించగలరని తెలిపారు
యూరియా బుకింగ్ యాప్ పై రైతులకు శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



