నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడ-హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ.. బ్రేక్డౌన్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని రాకపోకలను పునరుద్ధరించారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియరాలేదు.
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..ఇద్దరి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES