Wednesday, October 1, 2025
E-PAPER
Homeనల్లగొండపెంచికలపాడు వాసి అనుష కు సన్మానం

పెంచికలపాడు వాసి అనుష కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి
కలెక్టరేట్ఇటీవలి విడుదల చేసిన గ్రూపు-2 ఫలితాలలో యాదాద్రి భువనగిరి  జిల్లా భువనగిరి మండలం  పెంచికల్ పహాడ్ గ్రామనికి చెందిన కీ.శ్రే బాల్ద (రాజయ్య) లక్ష్మి ల కూతురు రాష్ట్ర సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపిక కావడంతో  గ్రామస్తులు  కుటుంబ సభ్యులను ఘనంగా బుధవారం సత్కరించారు. ఈ సందర్భంగా  గోపె నరసింహ మాట్లాడుతూ ఈ విజయం ద్వారా గ్రామానికీ మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయిలో నిలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకొని గ్రామంలో నిరుద్యోగులకు దిశ నిర్దేశం చేస్తూ మార్గదర్శకులు గా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో  కుటుంబ సభ్యులు బాల్ద మహేష్,  గ్రామ పెద్దలు సిలువేరు ఏసు, గోపె మహంకాళి, మహేష్, కుమారస్వామి, కరుణాకర్, సురేష్, రాజు లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -