బొడ్డు రాజబాబు రంగస్థలం , టీవీ , సినిమా రంగంలో సుప్రసిద్ధ కళాకారుడు. ఆయన స్మతికి నివాళిగా మిత్ర బందం పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకష్ణ చెప్పారు. బొడ్డు రాజబాబు 68వ జయంతి, స్మారక పురస్కారాల కార్యక్రమం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది . ముఖ్య అతిధిగా వచ్చిన గోపాల కష్ణ మాట్లాడుతూ, ‘రాజబాబు పేరుతో వివిధ రంగాల్లో నిష్టాతులైన వారిని సత్కరించి పురస్కారాలు అందజేయడం ఎంతో సముచితంగా ఉంది. రాజబాబు మా అందరికీ ఎంతో స్నేహ పాత్రుడు’ అని అన్నారు. నిర్మాత కె .ఎస్ . రామారావు మాట్లాడుతూ,’ప్రభుత్వాలే ప్రతి సంవత్సరం అవార్డులను ప్రదానం చేయలేకపోతున్నాయి . అలాంటిది రాజబాబు పేరుతో ప్రతి సంవత్సరం అవార్డులను అందిస్తున్నందుకు మిత్ర బందాన్ని అభినందిస్తున్నాను’ అని చెప్పారు. దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ,’రాజబాబు చనిపోయినా ఇంకా ఆయన మిత్ర బందం మనస్సులో పదిలంగా ఉన్నారు. ఆయన జయంతి కి పురస్కారాలు ప్రదానం చేసి ఒక వేడుకలా జరపడం, అందులో నన్ను భాగస్వామిని చేయడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీజోష్ పర్వతనేని రాంబాబు జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపారు.
రాజబాబు స్మృతికి పురస్కారాలతో నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES