నవతెలంగాణ – కమ్మర్ పల్లి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు నల్ల గణేష్ గుప్తాను ఘనంగా సన్మానించారు. స్థానిక రఘు టిఫిన్ సెంటర్ యజమాని చిటికేసి రఘు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు నల్ల గణేష్ గుప్తాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాధన కొరకు జరిగిన తొలి, మాలి దశ ఉద్యమంలో అనేక మంది పోరాడి నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని ఎంతోమంది యువత ప్రాణ త్యాగాలు చేయడం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గ్రామానికి చెందిన నల్ల గణేష్ గుప్తా కూడా మలి దశ తెలంగాణ సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా, నిర్బంధాన్ని ప్రతిఘటించి కేసీఆర్ కు మద్దతుగా మండల కేంద్రంలో ఆమరణ నిరాహారదీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారన్నారు. రాస్తారోకో, వంట వార్పు, హైదరాబాద్ లో జరిగిన మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, సడక్ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా మండలంలో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో గణేష్ గుప్తా పోషించిన పాత్రను కొనియాడుతూ పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. తనను సత్కరించిన రఘు టిఫిన్ సెంటర్ యజమాని చిటికేసి రఘు, ఆర్యవైశ్య సంఘం సభ్యులకు గణేష్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్తూర్ కిషన్, దొంతుల రమణయ్య, ఆమెటి శంకర్, నల్ల నాగభూషణం, పాటీ హనుమాన్ సేవకుడు రాజు, టీవీ మెకానిక్ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడికి సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES