- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరగాల్సిన కీలక సమావేశాన్ని రద్దు చేసుకుంటానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
- Advertisement -