నవతెలంగాణ – హైదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఈ భేటీ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరుదేశాల అధ్యక్షుల భేటీకి ముందుగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఈ సమావేశం కూడా వాయిదా పడిందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుల భేటీకి ముందు నిర్మాణాత్మక చర్చల కోసం ఈ సమావేశం ఉద్దేశించబడిందని రష్యా పేర్కొంది. ఇరు దేశాధ్యక్షుల భేటీ వాయిదాకు గల స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు. అయితే, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారంపై అమెరికా–రష్యా అధ్యక్షుల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా సహకార చర్చలు జరపాలన్న రూబియో ప్రతిపాదనపై ఇరుదేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.
ట్రంప్-పుతిన్ సమావేశం వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES