నవతెలంగాణ-హైదరాబాద్: రోజురోజుకు టర్క్ బయ్కాట్ ఉద్యమం ఊపందుకుంటుంది. పాకిస్తాన్ కు సహకరించిన టర్కీపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారతీయ వ్యాపారులు ఆ రెండు దేశాలకు చెందిన ఉత్పత్తులను స్వచ్ఛందంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. టర్కీ పర్యాటక రంగంతో పాటు దిగుమతి ఉత్పత్తుల బహిష్కరణతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా టర్కీ యాపిల్స్, మార్బుల్స్, పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. పూణె లాంటి ప్రాంతాల్లో వ్యాపారులు టర్కీ యాపిల్స్ను బహిష్కరిస్తున్నారు. అలాగే, టర్కీ మార్బుల్స్ను ఇంటీరియర్ డిజైన్, నిర్మాణ రంగాల్లో ఉపయోగించకుండా ఉండాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. ఇండియా నిర్ణయంతో టర్కీకి చెందిన నిర్మాణ ఉత్తత్తుల దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిన్న మహారాష్ట్ర ఆపిల్ మార్కెట్ నిర్వహకులు టర్కీ ఆపీల్ విక్రయాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
