- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి వాడలోని ఓ ఇంట్లో షార్ట్సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విజయ్ అనే వ్యక్తితోపాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



