Saturday, May 17, 2025
Homeజాతీయంముంబైలో ఇద్దరు ISIS ఉగ్ర‌వాదులు అరెస్ట్

ముంబైలో ఇద్దరు ISIS ఉగ్ర‌వాదులు అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ముంబై విమానాశ్రయంలో ఉగ్రవాద సంస్థ ఐసీస్‌ స్లీపర్‌ సెల్‌లో భాగమైన ఇద్దరిని అదుపులోకి తీసుకన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) అధికారులు శనివారం తెలిపారు. 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీల తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్న అబ్దుల్లా ఫయాజ్‌ షేక్‌ అలియాస్‌ ‘డైపర్‌వాలా’ , తల్హా ఖాన్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు ఇండోనేషియాలోని జకార్తా నుండి భారత్‌కు తిరిగి వచ్చారని.. గత రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ 2 వద్ద ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎన్‌ఐఏ బృందం వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితులు రెండేళ్లకు పైగా పరారీలో ఉన్నారని.. వారిపై ముంబైలోని ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -