- Advertisement -
13 మందికి జరిమాన
నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష పడిందని 13 మందికి జరిమాన విధించారని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం పి. ప్రసాద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 13 మందికి 28,500/- రూపాయలు జరిమానా విధించమన్నారు. మరో ఇద్దరికి తుమ్మ శ్రీవాత్సవ్ అను వ్యక్తికి ₹2,000 జరిమానా, 7 రోజుల జైలు శిక్ష పడిందని తెలిపార. అదే విధంగా మరో వ్యక్తి ఇందూరి మచ్చేందర్ కు 7 రోజుల జైలు శిక్ష పడిందని తెలిపారు.
- Advertisement -



