Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎదురెదురుగా కారు బైక్ ఢీ.. ఇద్దరు కూలీలు మృతి 

ఎదురెదురుగా కారు బైక్ ఢీ.. ఇద్దరు కూలీలు మృతి 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
ఎదురెదురుగా కారు బైకు ఢీకొని ఇద్దరు యువ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన దుబ్బాక మండలం తిమ్మాపూర్ పరిధి పెద్దగుండవెల్లి కమాన్ సమీపంలో ఎల్కతుర్తి- మెదక్ 765 డీజీ నేషనల్ హైవే పై ఆదివారం రాత్రి జరిగింది. దుబ్బాక ఎస్ఐ వీ.గంగరాజు తెలిపిన వివరాలు.. అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లికి చెందిన పల్లె అనిల్ (27) తండ్రి స్వామి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన ఉచ్చూరి పాపయ్య (30) తండ్రి దావీదు అనే ఇద్దరు యువ కూలీలు ఆదివారం రాత్రి టూ వీలర్ బైక్ పై సిద్దిపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో నిజామాబాద్ కు చెందిన జక్కని సంతోష్ సిద్దిపేట నుంచి రామాయంపేట వైపు కారులో  వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. కింద పడ్డ ఇరువురికి ముఖానికి, తలకు బలమైన గాయలవడంతో స్థానికులు గమనించి.. 108 సిబ్బందికి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వీరిని సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పల్లె అనిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ పాపయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మృతుడు పల్లె అనిల్ సోదరుడు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -