నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన వివరాల్లోకి వెళితే…కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్, సైనిక్ పురి కి చెందిన వర్షిత్, ఓల్డ్ అల్వాల్ కి చెందిన ప్రవీణ్, వైజాగ్ కు చెందిన దినేష్ వీరంతా యాక్సెంచర్ కంపెనీకి చెందిన సాఫ్ట్వేర్ఉద్యోగులుగా తెలుస్తోంది.
వీరు ఎదులాబాద్ లోని విహారి ఫామ్ హౌస్ లో బస చేసి శుక్రవారం అర్ధరాత్రి (TS 08 HE 5796) కారులో తిరిగి వెళ్తుండగా ఎదులాబాద్ నుంచి మాదారం క్రాస్ వద్దకు రాగానే కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో భార్గవ్ యాదవ్, వర్షిత్ లు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దినేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న ఘట్కేసర్ పోలీసులు ప్రవీణ్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES