- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీసీసీఐ(Board of Control for Cricket in India) టీమిండియా షెడ్యూల్ను విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు జూన్లో ఐర్లాండ్ టీం తో రెండు టి 20 మ్యాచ్లు ఆడనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్లు జూన్ 26, 28 తేదీల్లో Belfast లో జరగనున్నాయి. 2007 తర్వాత మళ్లీ బెల్ఫాస్ట్ వేదికపై టీమిండియా మ్యాచ్ ఆడటం విశేషం.
జూన్లో ముందుగా భారత్ అఫ్ఘాన్ టీంతో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఆడనుంది. ఆ సిరీస్ జూన్ 20న ముగిసిన తర్వాత టీమిండియా ఐర్లాండ్కు ప్రయాణిస్తుంది. అనంతరం జూలై 1 నుంచిఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
- Advertisement -



