- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24) అనే ఇద్దరు యువతులు మృతి చెందారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లిన ఈ యువతులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



