Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంజ‌మ్మూలో ఇద్దరు ఉగ్ర‌వాదులు స‌రెండ‌ర్

జ‌మ్మూలో ఇద్దరు ఉగ్ర‌వాదులు స‌రెండ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో కేంద్ర బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మైన విష‌యం తెలిసిందే. దీంతో జ‌మ్మూక‌శ్మీర్ తో స‌హా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో సెర్చ్ ఆప‌రేష‌న్ ముమ్మ‌రం చేశాయి.ఈ క్ర‌మంలో ఈరోజు జమ్మూకశ్మీర్‌ లోని షోపియాన్ జిల్లాలోని ఇమామ్ సాహిబ్‌లోని బస్కుచన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం భద్రతా దళాలలకు అందింది. దీంతో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు, 178 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే వారి ఎదుట హైబ్రిడ్ మిలిటెంట్లు ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్ ఇద్దరు లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 102 రౌండ్స్‌ , 2 హ్యాండ్‌ గ్రనేడ్లు, రెండు పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు లోకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -