- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామ బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి రెండు మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొనగా చికిత్స పొందుతూ ఒకరు మరణించినట్టు ఎస్సై శ్యామ్ రాజ్ బుధవారం తెలిపారు. మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్సు లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా తీవ్ర గాయాలు అయిన కొడపాల్ సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినాడు అని తెలిపారు. మృతుని తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు అతివేగం ఆ జాగ్రత్త నడిపిన బైక్ డ్రైవర్ వెలుమల ప్రవీణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
- Advertisement -



