- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : U19 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న సూపర్-6 మ్యాచ్ లో స్వల్ప స్కోరుకే భారత్ ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగుచేసింది. భారత బ్యాటర్లలో వేదాంత్ త్రివేది(68) అర్ధ సెంచరీ చేయగా.. కాన్షిక్ చౌహన్ (35), అంబ్రిష్ (29), వైభవ్ (30) రాణించారు. చివరి 10 ఓవర్లలో భారత్ 72 పరుగులు రాబట్టినప్పటికీ 5 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ విజయం సాధించాలంటే 253 పరుగులు చేయాల్సి ఉంది.
- Advertisement -



