- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారని పేర్కొంది. దీంతో ఆయన హాజరుకావాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది.
- Advertisement -