పారిస్: పాలస్తీనాపై ఐక్యరాజ్య సమితి నిర్వహించాల్సిన ఉన్నత స్థాయి సమావేశం వాయిదా పడింది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన నేపథ్యంలో వచ్చే వారం జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తెలిపారు. భద్రతా కారణాల రీత్యా సమావేశాన్ని వాయిదా వేశామని చెప్పారు. పాలస్తీనా ప్రతినిధులు కొంతమంది ఈ సమావేశానికి రాలేకపోతున్నారని తెలిపారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో చర్చిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 17-20 తేదీల్లో ఫ్రాన్స్, సౌదీ అరేబియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జనరల్ అసెంబ్లీ ఆతిథ్యమిస్తోంది. దీర్ఘకాలంగా స్తంభించిపోయిన శాంతి ప్రక్రియ దీంతో పునరుద్ధరించ బడుతుందని పాలస్తీనా అథారిటీ ఆశించింది. సమావేశం వాయిదా పడినప్పటికీ పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని తమ దేశం కృత నిశ్చయంతో వుందని మాక్రాన్ చెప్పారు. అదే సమయంలో ఇజ్రాయిల్ ఆత్మ రక్షణ హక్కును కూడా సమర్ధిస్తామన్నారు. ఇరాన్పై దాడులపై స్పందిస్తూ, ఆ ప్రాంతంలో భాగస్వాముల రక్షణకు సిద్ధంగా వున్నామని చెప్పారు. అయితే ఇరాన్పై దాడుల్లో మాత్రం పాల్గొనబోమని స్పష్టం చేశారు.
పాలస్తీనాపై యూఎన్ సమావేశం వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES