Monday, June 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనిధుల కొరత..సిబ్బంది ఉద్వాస‌న‌కు ఐరాస సిద్ధం

నిధుల కొరత..సిబ్బంది ఉద్వాస‌న‌కు ఐరాస సిద్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నిధుల కొరతను ఎదుర్కొనేందుకు 20శాతం సిబ్బందిపై కోత వేసేందుకు ఐరాస సిద్ధమైంది. 60కి పైగా ఐరాస కార్యలయాలు, ఏజన్సీల్లో జూన్‌ మధ్యనాటికి 20శాతం సిబ్బందిని తగ్గించడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఐరాస ఆదేశించింది. ఈ కోతలు సాధారణ బడ్జెట్‌ పరిధిలోకి వచ్చే సుమారు 14,000 పోస్టులను లేదా సుమారు 2,800 పోస్టులను ప్రభావితం చేస్తాయని యుఎన్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వీటిలో యుఎన్‌ రాజకీయ, మానవతా కార్యలయాల సిబ్బంది, శరణార్థులకు సహాయం అందించే ఏజన్సీలు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు అంతర్జాతీయ వాణిజ్యం, పర్యావరణం మరియు నగరాలు వంటి సంస్థలు ఉన్నాయి. పాలస్తీనా శరణార్థులకు మద్దతు ఇచ్చే యుఎన్‌ ఏజన్సీ, యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

సిబ్బంది కోతలు ఐరాస ప్రస్తుత బడ్జెట్‌ 3.72 బిలియన్‌ డాలర్లలో 15శాతం మరియు 20శాతం తగ్గింపును సాధించాలన్న సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ లక్ష్యంగా భాగమని ఐక్యరాజ్యసమితి కంట్రోలర్‌ చంద్రమౌలి రామనాథన్‌ బాధిత సంస్థలకు రాసిన మెమోలో పేర్కొన్నారు. ఏ పోస్టులకు తగ్గించాలో పలు సూచనలు చేసింది. సమర్థత, ప్రభావాలను ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. అన్ని సభ్యదేశాలు తమ వార్షిక బకాయిలు చెల్లించడం లేదని, కొన్ని దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో గత ఏడేళ్లుగా ఐక్యరాజ్యసమితిలో నిధులు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. చైనా ఇటీవల తన వాటాను 20శాతానికి పెంచగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న అమెరికా సాధారణ బడ్జెట్‌లో 22శాతం చెల్లించాల్సి వుందని తెలిపింది. గతేడాది యుఎన్‌లోని 193 సభ్యదేశాల్లో చైనాతో సహా 152 దేశాలు తమ బకాయిలను పూర్తిగా చెల్లించాయి. కానీ అమెరికా సహా 41 దేశాలు చెల్లించలేదని వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -