- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్లోని సమస్తిపూర్లో డిప్యూటీ జైలర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. 2023 మే నెలలో అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ నందు చౌదరీతో శ్వేతా కుమారి వివాహం జరిగింది. ఈ క్రమంలో శ్వేత అత్తారింట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. అయితే అత్తింటి వేధింపులే కారణమని, రూ.10 లక్షలతో సహా ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వాలని శ్వేతాను వేధించారని, 3 రోజులు ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసి హత్య చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భర్త, అత్తింటి వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



