- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని దొండపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మాధవి (23) అనే యువతి 2021లో మనోజ్తో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం తరచూ వేధించడంతో భరించలేక బుధవారం రాత్రి మాధవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని స్థానికులంటున్నారు. మాధవి తల్లిదండ్రులు హత్య అని ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -