నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ను ఎంచుకుంది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది మూడో మ్యాచ్. ఇంతకుముందు యూఎస్ఏ, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. రెండు విజయాలతో భారత జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. గ్రూప్ బిలో ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో ఉంది.
భారత తుది జట్టు : ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), అరోన్ జార్జి, కాన్షిక్ చౌహాన్, అంబ్రిష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మహ్మద్ ఎనాన్
న్యూజిలాండ్ తుది జట్టు : ఆర్యన్ మన్, హ్యూగో బోగ్, టామ్ జోన్స్(కెప్టెన్), స్నేహిత్ రెడ్డి, మార్కో ఆల్పే (వికెట్ కీపర్), జాకబ్ కాటర్, జస్కరన్ సంధు, కల్లమ్ శాంసన్, ఫ్లిన్ మోరీ, సెల్విన్ సంజరు, మాసన్ క్లార్క్



