Thursday, June 12, 2025
E-PAPER
Homeజాతీయంప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం భేటీ

ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం భేటీ

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలోని ప్రధాని మోడీ అధికార నివాసంలో ఇవాళ కేంద్ర మంత్రివ‌ర్గం సమావేశం జరగనుంది. పీఎం అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న‌ ఈ భేటీలో ప‌లు కీలక అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా సమాచారం. విధానపరమైన నిర్ణయాలు, అంతర్గత భద్రతా ఆందోళనలపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగ్రవాదం అణిచివేత, వాణిజ్యం, డిజిటల్ ఎన్‌ఫ్రాస్ట్రక్టర్ లాంటి అంశాలు ప్రధానంగా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -