- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీ లోని సుష్మా స్వరాజ్ భవన్ లో కేంద్ర కేబినేట్ భేటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా హాజరుకానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా ఈ భేటీలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరును ప్రధానంగా సమీక్షించనున్నారు. అదేవిధంగా కీలక అంతర్గత విషయాలను చర్చించనున్నారు.మరోవైపు జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడుతామని ప్రకటించిన నేపథ్యంలో ఆ అంశంపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -