Thursday, June 5, 2025
E-PAPER
Homeజాతీయంఅసోంలో ఆగ‌ని వ‌ర‌ద ఉధృతి

అసోంలో ఆగ‌ని వ‌ర‌ద ఉధృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈశాన్య రాష్ట్రాల్లో అకాల వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌లు పోటెత్తిన విష‌యం తెలిసిందే. భారీ వ‌ర్షాల‌కు న‌దులు, వాగులు, వంక‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో అసోంలో ప‌లువురు వ‌ర‌ద‌ నీటిలో గ‌ల్లంతు కాగా, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి మ‌రికొంద‌రు మృతి చెందారు. తాజాగా మ‌రో 11మంది మృతి చెందిన‌ట్టు ఆ రాష్ట్ర విపత్తు ద‌ళం ఉన్న‌తాధికారులు తెలిపారు. భారీ వ‌ర‌ద‌ల‌కు ఆరుగురు మృతి చెంద‌గా..మ‌రో ఐదుగురు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి మ‌ర‌ణించార‌ని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5.15 ల‌క్ష‌ల మంది, 22 జిల్లాలు భారీ వ‌ర‌ద‌ల‌కు ప్ర‌భావిత‌మై, పెను విధ్వంసం సృష్టించాయ‌ని అధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ‌డిచిన 24గంట‌ల్లో ఓ వ్య‌క్తి వ‌ర‌ద నీటిలో ప‌డిపోగా, మ‌రో ఇద్ద‌రు గ‌ల్లంతు అయిన‌ట్టు వెల్ల‌డించారు.

జూన్ 2 నాటికి, రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 65 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలో మొత్తం 1254 గ్రామాలు – హైలకండి, హోజై, లఖింపూర్, నాగావ్, శ్రీభూమి, కర్బీ ఆంగ్లోంగ్, దిబ్రూఘర్, మోరిగావ్, కమ్రూప్, కాచర్, గోలాఘాట్, దర్రాంగ్, మజులి, ధేమాజీ, బిర్‌వానాగ్, బిర్‌వానాగ్, జోర్హాట్, టిన్సుకియా, సోనిత్‌పూర్, డిమా-హసావో, శివసాగర్- ప్రస్తుత వరదల్లో దెబ్బతిన్నాయి. బరాక్ దాని అనేక ఉపనదులతో పాటు బ్రహ్మపుత్ర నది, నీమతిఘాట్, తేజ్‌పూర్, బదాతిఘాట్, నుమాలిఘర్, కాంపూర్, ఫులెర్టల్శ్రీ భూమి వంటి అనేక ప్రాంతాలలో ప్రమాద స్థాయిని మించి వ‌ర‌ద నీరు ప్రవహిస్తున్నాయి. వరదలు 12,610.27 హెక్టార్ల పంట భూములను ముంచెత్తాయి, దీనివల్ల వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీభూమి అత్యంత ప్రభావిత జిల్లాగా మిగిలిపోయింది. 1.94 లక్షలకు పైగా ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

మ‌రోవైపు వ‌ర‌ద బాధితుల‌ను ర‌క్షించ‌డానికి ఆర్మీతో పాటు ప‌లు భ‌ద్ర‌తా ద‌ళాలు రంగంలోకి దిగాయి. ప‌డ‌వ‌లు, హెలీకాప్ట‌ర్ల సాయంతో బాధితులను నిర్విరామంగా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వాట‌ర్ ప్యాకెట్లు, ఆహార ప‌దార్థాల‌ను బాధితుల‌కు అధికారులు పంపిణీ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -