- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై ప్రభావం పడుతున్న తరుణంలో, భారత్ రష్యా చమురును దిగుమతి చేసుకోవడానికి అమెరికా తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా నౌకల నుంచే ఈ కొనుగోళ్లు చేయాలని, తద్వారా రష్యాకు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం చేకూరదని తెలిపారు. భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, భవిష్యత్తులో ముడి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నట్లు బెసెంట్ పేర్కొన్నారు.
- Advertisement -



