Friday, June 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిద్యార్థి వీసాలకు అమెరికా గ్రీన్ సిగ్న‌ల్‌

విద్యార్థి వీసాలకు అమెరికా గ్రీన్ సిగ్న‌ల్‌

- Advertisement -

– సోషల్‌ మీడియా ఖాతాల తనిఖీ తర్వాతే!
– తాత్కాలిక విరామం తర్వాత వీసాల మంజూరు ప్రక్రియ షురూ
వాషింగ్టన్‌:
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. తాత్కాలిక విరామం తర్వాత విద్యార్థి వీసాల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. అయితే దరఖాస్తుదారులు స్క్రీనింగ్‌ సమయంలో తప్పనిసరిగా సోషల్‌ మీడియా అకౌంట్ల వివరాలు సమర్పించాలని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాం గ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను యూఎస్‌ కాన్సులర్‌ అధికారులు తనిఖీ చేస్తారు. అందుకోసం విద్యార్థులు తమ సోషల్‌ మీడియా ఖాతాలను ప్రయివేటు సెట్టింగ్స్‌ను మార్చుకుని పబ్లిక్‌గా అన్‌లాక్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. అప్పుడే విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా, వద్దా అనేది నిర్ణయిస్తాం’ అని సీనియర్‌ అధికారి తెలిపారు.
ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిప ివేసింది. అయితే, ఇది తాత్కాలికమే నని తెలిపింది. వీసా జారీ కోసం అవసరమైన సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించాలని అనుకుంటున్నట్టు అప్పుడు విదేశాంగ శాఖ తెలిపింది. అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసే వరకు వీసాల బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొంది. తాజాగా సోషల్‌ మీడియా తనిఖీని తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.సోషల్‌ మీడియా వెట్టింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో సంబంధిత విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు.
ఉదాహరణకు ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనాకు సంబంధించి ఏమైనా పోస్ట్‌ చేస్తే, ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా అని చూస్తారు. అలాంటి ఏమి లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికాలో చదువుకునేందుకు వీలు కల్పిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -