- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై వైమానిక దాడులతో విధ్వంసం చేస్తున్నాయి. గత నెల ఫిబ్రవరి 28న మినాబ్ స్కూల్పై యూఎస్ మిస్సైల్ దాడి చేయడంతో దాదాపు 170మంది బాలికలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖొమేన్ ప్రాంతంలో సామాన్య ప్రజల ఇండ్లు, విద్యాసంస్థలే లక్ష్యంగా మెరుపుదాడులు జరుపుతున్నాయి. ఈ దాడులతో ఆయా ప్రాంతాల్లో అనేక ఇండ్లు, స్కూల్స్ నేలమట్టమైయ్యాని ఇరాన్ మేహర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పలు ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, భారీ అంతస్తులు పేకమేడలా కుప్పకులాయి. అకారణంగా తమ నివాసాలపై దాడులు చేయడం సమంజసం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



