- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వ లైబ్రరీని సేవల్ని వినియోగించుకుని.. భవిష్యత్తులో ఉద్యోగ, ఉన్నత రంగాల్లో స్థిరపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కే. లింగమూర్తి ఆకాంక్షించారు. బుధవారం దుబ్బాక లోని ప్రభుత్వ లైబ్రరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీయన్ దాసరి రాజు చైర్మన్ కి పలు సమస్యలు విన్నవించారు. త్వరలోనే దుబ్బాకలో డిజిటల్ లైబ్రరీ మంజూరికి కృషి చేస్తానని, త్వరలోనే మరిన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. వారి వెంట టీజేఎస్ యువజన విభాగం నాయకులు కీసరి స్వామి, పలువురున్నారు.
- Advertisement -