నవతెలంగాణ-హైదరాబాద్: సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్కు ఇంకా పట్టు రానట్టుందని, ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవాచేశారు. మిస్టర్ ఉత్తమ్ మీ చేతకాని తనాన్ని మాపై రుద్దుతున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు రెండేళ్ళ క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని అసెంబ్లీ వద్ద మీడియా చీట్ చాట్ లో ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1900కోట్లు ఖర్చు పెట్టింది. ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ హయాంలో 3 డీపీఆర్లు వాపస్ వచ్చాయి. రెండేళ్లలో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదన్నారు హరీష్ రావు.
సభను కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టాం. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని హరీష్ రావు అన్నారు. వారం తర్వాత మళ్లీ బీఏసీని పిలుస్తామన్నారు. నదీ జలాలపై సభలో బీఆర్ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తాం . కాంగ్రెస్ వచ్చాక క్వశన్ అవర్ 6 రోజులు మాత్రమే పెట్టారు. ప్రతీ రోజు క్వశ్చన్ అవర్ పెట్టాలని కోరాం. ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలు వేయాలని కోరాం. ఎజెండా పంపే పద్దతి సరిగా లేదు. 24గంటల ముందే అజెండా ఇవ్వాలని కోరాం. 15 అంశాలపై సభలో చర్చించాలని పట్టు పట్టామన్నారు.



