- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో శ్రీరామ నవమి రోజున విషాదం చోటుచేసుకుంది. కాన్పూర్-ప్రయాగ్రాజ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఫతేపూర్ జిల్లా బడోఖర్ గ్రామానికి చెందిన సుమారు 25 మంది ప్రయాణికులు శ్రీరామ నవమి సందర్భంగా శీతలా ధామ్ దర్శనం కోసం పికప్ వ్యాన్ అద్దెకు తీసుకుని వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కంటైనర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



