పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘తార తార’ అనే పాట ఆవిష్కరణ వేడుకను చిత్ర బృందం చెన్నైలో ఘనంగా నిర్వహించింది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ పై చిత్రీకరించిన ఈ గీతం వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. కీరవాణి సంగీతం హద్యంగా ఉంది. శ్రీ హర్ష తన సాహిత్యంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ ఈ గీతాన్ని ఆలపించిన తీరు కట్టిపడేసింది. దీంతో ఈ గీతం సామజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘తార తార’ పాట ఆవిష్కరణ వేడుకలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, ”ఎ.ఎం.రత్నం ముఖంలో నేను కోపం ఎప్పుడూ చూడలేదు. శాంతంగా, చిరునవ్వుతో ఉంటారు. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సంగీతంలో పవర్ కనిపించాలి. సంగీత విషయంలో జ్యోతికష్ణ నాకెంతో స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి.. ఎ.ఎం. రత్నంకి, జ్యోతికష్ణకి, సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు. ‘పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలివైన వారు, ఎన్నో విభాగాల్లో పట్టుంది. రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఆయనెంతో సపోర్ట్ చేశారు’ అని దర్శకుడు జ్యోతి కష్ణ చెప్పారు.
‘వీరమల్లు..’ ఘన విజయం ఖాయం
- Advertisement -
- Advertisement -