Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంకృత్రిమ మేధస్సుపై వెంకయ్యనాయుడు ఆందోళన

కృత్రిమ మేధస్సుపై వెంకయ్యనాయుడు ఆందోళన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కృత్రిమ మేధస్సు (AI) పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 21న విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన మాట్లాడుతూ, AIతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనని, వావివరుసలు మరిచిపోతారేమోనని భయమేస్తుందని అన్నారు. AIని విధ్వేషాలు రెచ్చగొట్టకుండా కట్టడి చేయాలని, నైతిక విలువలతో కూడిన సాంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. లేదంటే AI సమాజాన్ని సంక్షోభంలోకి నెడుతుందని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -