Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కను కలిసిన వేణుగోపాల్ యాదవ్

మంత్రి సీతక్కను కలిసిన వేణుగోపాల్ యాదవ్

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా  పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి సీతక్క నియమితులవ్వడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, కామారెడ్డి జిల్లా పీసీసీ పరిశీలకులు బాస వేణుగోపాల్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని మంత్రి సీతక్క నివాసంలో ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాస వేణుగోపాల్ యాదవ్ మంత్రి సీతక్కకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -