Thursday, June 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వాయిదా

గ్రూప్‌-3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన వాయిదా

- Advertisement -

– గ్రూప్‌-2 నియామకాలు పూర్తయ్యాక నిర్వహణ : టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో గ్రూప్‌-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ధ్రువపత్రాల పరిశీలన వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 18 నుంచి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో గ్రూప్‌-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొందరు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్‌-2 నియామకాల ప్రక్రియ పూర్తయ్యాక గ్రూప్‌-3 ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
బ్యాక్‌లాగ్‌ పోస్టులు మిగలకుండా ఉండొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇతర వివరాల కోసం షషష.్‌రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. గతనెల 29 నుంచి ఈనెల పదో తేదీ వరకు గ్రూప్‌-2 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశమున్నది. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి గ్రూప్‌-3 ద్వారా 1,388 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -