- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; మలయాళ సినీ రంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు E.A. రాజేంద్రన్ (71) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొల్లంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గ్రాడ్యుయేట్ అయిన రాజేంద్రన్ ‘నరసింహం’, ‘మీశమాధవన్’, ‘కలియాట్టం’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆయన మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. కేరళ సాంస్కృతిక రంగానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. రేపు త్రిసూర్ జిల్లాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- Advertisement -



