- Advertisement -
బెంగళూరు : ప్రయివేటు రంగంలోని వొడాఫోన్ ఐడియా (విఐ) కొత్తగా బెంగళూరులో తన 5జి సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దశల వారిగా దేశంలోని 17 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. నగరాల్లో వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ సేవలకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. సామ్సంగ్ మౌలిక వసతుల మద్దతుతో 5జి సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ 5జి ప్లాన్ ధరలు రూ.299 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.
- Advertisement -