– పలు ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలను
– తయారుచేసి ఇచ్చారని అభియోగం
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ (తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖ పరిశోధనాలయం)లో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఆర్కైవ్స్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది. మధ్యాహ్నం అక్కడకు చేరుకున్న అధికారులు గేట్లు మూసేసి లోపలి నుంచి తాళాలు వేసి తనిఖీలు చేపట్టారు. రాకపోకలు నిలిపివేసి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. వలు దస్తావేజులను వారు వరిశీలిస్తున్నారు. రాజ్యాభిలేఖ పరిశోధనాలయం కొన్నేండ్లుగా అరాచకాలకు ఆవాసంగా మారిందని ఇక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది కొందరు భూకబ్జాదారులతో కుమ్మక్కై విలువైన పత్రాలను దారి మళ్లిస్తున్నారనే ఆరోవణలు ఉన్నాయి. వాటి స్థానాంలో నకిలీ పత్రాలు చేర్చి, అవే నిజమైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తున్నారని తెలిసింది. విలువైన భూములు కబ్జాదారుల పరమయ్యేందుకు, న్యాయ వివాదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.
స్టేట్ ఆర్కైవ్స్లో విజిలెన్స్ తనిఖీలు
- Advertisement -
- Advertisement -