Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విజ్ఞాన్ సూపర్ 30 క్యాంపస్ విద్యార్థులు

ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన విజ్ఞాన్ సూపర్ 30 క్యాంపస్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: జన్నారం మండల కేంద్రంలో ఉన్న విజ్ఞాన్ సూపర్ 30 క్యాంపస్ తన ప్రతిభను చాటుకుంది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఐదుగురు విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై సంస్థకు గర్వకారణంగా నిలిచారు. విద్యార్థులు ఎల్. సహస్ర, ఎల్.షైనిక, టి.శ్రీ హర్షిణి, బి.అక్షిత్ రాజ్, కె.నిహిత్ ప్రవేశ పరీక్షలో అర్హ‌త సాధించారు.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ పడమటింటి రంజిత్, ఉపాధ్యాయులు దివ్య జ్యోతి, గంగా రెడ్డి, గంగా రాజ్ గౌడ్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఫలితమే ఈ విజయం అని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -