- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులోని కరూర్లో శనివారం తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 39 మంది మృతి చెందగా.. వారికి టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు రూ.2లక్షలు ప్రకటించారు. ఈ డబ్బు.. వారికి జరిగిన లోటును పూడ్చలేదని పేర్కొన్నారు. తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని వివరించారు. ఇక సీఎం స్టాలిన్ సైతం మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
- Advertisement -